వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కాకినాడ మొబైల్ కోర్టు రిమాండ్ విధించింది, డ్రైవర్ సుబ్రమణ్యం కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలపై శుక్రవారం రోజున రాజమండ్రి కోర్టు వద్ద అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సర్పవరం పోలీస్ స్టేషన్కు అనంతబాబును తరలించిన పోలీసులు.. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకూ విచారించారు. ఆ తర్వాత కాకినాడ జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. కాకినాడ మొబైల్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అనంతబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.