ఎంత చదువుకొని ఏం లాభం చాలా మందికి ఓటేసుడు కూడా వస్తలేదు. డిగ్రీలు, పీజీలు చేసినా.. టీచర్లుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించినా.. ప్రాథమిక హక్కులో భాగమైన ఓటేయటం మాత్రం తెలవట్లేదు. ఇటీవల తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోగా.. భారీగా చెల్లని ఓట్లు బయటపడ్డాయి. చాలా మంది ఓటేయటం రాకపోవటంతో వాటిని ఇన్ వ్యాలిడ్ ఓట్లుగా పరిగణించారు.