తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగింది. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలకు ఫిబ్రవరి 3 న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఈసీ తెలిపింది. షెడ్యూల్ విడదులతో ఈ స్థానాల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టయ్యింది. ఈ మూడు స్థానాలు మార్చి 29తో ఖాళీ కానునున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ ఎన్నికలను గడువులోగా నిర్వహిస్తోంది.