హైదరాబాద్ MMTS రైలులో అత్యాచారయత్నం జరిగిందన్న కేసులో దిమ్మతిరిగి బొమ్మ కనపడే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇన్ని రోజులూ.. తనపై ఎవరో ఓ వ్యక్తి అత్యాచారం చేయబోయాడని.. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కదులుతున్న రైలులో నుంచి కిందికి దూకేశానంటూ ఎమోషనల్ స్టోరీ చెప్పిన యువతి.. ఇప్పుడు అసలు విషయం బయటపెట్టింది. సదరు మహాతల్లి.. రైలులో రీల్స్ చేస్తూ కాలు జారి కిందపడిందని.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.