ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఎంతటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అంటే గాలి కాదని తుపాన్ అంటూ అప్పట్లో నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ను ప్రశంసించిన సంగతి కూడా తెలిసిందే. అయితే అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో వీరి సాన్నిహిత్యాన్ని తెలియజేసే ఘటన జరిగింది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో పేరును బయటపెట్టడం ఒక విశేషమైతే.. పవన్ కళ్యాణ్ ప్రసంగం పూర్తి కాగానే పవన్కు మోదీ చాక్లెట్ ఇవ్వడం మరో విశేషం.