నటుడు మోహన్ బాబు, ఆయనకు చెందిన మోహన్ బాబు యూనివర్సిటీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. విద్యార్థి సంఘాల నేతలను కిడ్నాప్ చేయించారనే ఆరోపణలపై మోహన్ బాబుపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు ఆధారంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు తమ ప్రతిష్టను భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తున్నారంటూ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కూడా చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది.