ప్రపంచాన్ని వణుకు వణికించిన కరోనా వైరస్ ఇప్పుడిప్పుడే పూర్తిగా కనుమరుగవుతున్న నేపథ్యంలో.. మరో కొత్త వైరస్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్.. పక్క దేశాలకు కూడా అంతే వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుండటంతో.. భారత్ అప్రమత్తమైంది. అందులో భాగంగానే.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ అలెర్ట్ కావటమే కాకుండా.. హైదరాబాద్లో ఆస్పత్రులను కూడా సిద్ధం చేసింది. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో బెడ్లు సిద్ధం చేసింది.