తెలంగాణలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది. ఈ క్రమంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం తెలంగాణ సర్కార్ సమాయత్తం అవుతోంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి చర్చించేందుకు ఈనెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశం తర్వాత.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఒక క్లారిటీ రానుందని తెలుస్తోంది.