మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం మాంజాతండాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను తన భర్త కర్రతో విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. అంత క్రూరంగా కొట్టి చంపేసేంత పని ఏం చేసిందనేగా మీ డౌటనుమానం. ఆ భర్త చెప్పినట్టుగా మటన్ వండలేదట. తాను వండమన్న మటన్ వండలేదన్న కోపంతో ఊగిపోయిన భర్త.. భార్యను కర్తతో ఇష్టమున్నట్టుగా కొట్టాడు. ఆ దెబ్బలు గట్టిగా తగలటంతో.. ఆమె కాస్త ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచింది.