కొబ్బరి బొండాల మాటును ఆవులను అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది. ఓ ప్రమాదం కారణంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి జాతీయ రహదారిపై అశోక్ లేలాండ్ వాహనం బోల్తాపడింది. దీంతో కొబ్బరి బొండాల రవాణా ముసుగులో ఆవు దూడలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టు బయటపడింది. ఓ వాహనంలో 12 దూడలను కట్టేసి పైనుంచి కొబ్బరి బొండాలు వేసి కబేలాకి తీసుకు వెళుతున్నట్లు స్థానికులు గుర్తించారు. పారిపోతున్న వాహనం డ్రైవర్ని పట్టుకున్న పోలీసులకు అప్పగించారు. ఈ ప్రమాదంలో12 ఆవు దూడల్లో ఒకటి చనిపోగా.. రెండింటికి గాయాలయ్యాయి.