హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కరెంట్ షాక్ కారణంగా చనిపోయిన రమేష్ అనే మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల హిందూపురం పర్యటనకు వెళ్లిన బాలకృష్ణను రమేష్ కుటుంబసభ్యులు కలిశారు. వారి సమస్యలను విన్న బాలకృష్ణ.. అప్పటికప్పుడే రూ.5 లక్షల రూపాయల సొంత డబ్బులను వారికి అందించారు. అనంతరం పోలీసులకు రూ. 50 లక్షల విలువైన వాహనాలను అందజేశారు.