Nara Lokesh Delhi Tour Funds Sanctioned: విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటన విజయవంతమైంది. కేంద్ర మంత్రులను కలిసి విద్యా రంగానికి నిధులు కోరగా, కేంద్రం ఆంధ్రప్రదేశ్కు భారీగా నిధులు మంజూరు చేసింది. సమగ్ర శిక్షణ కోసం గతంలో కంటే అదనంగా రూ.432.19 కోట్లు కేటాయించబడ్డాయి. సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల అభివృద్ధికి రూ.167.46 కోట్లు విడుదలయ్యాయి. డైట్ కళాశాలల అభివృద్ధికి కూడా నిధులు మంజూరయ్యాయి. ఆదివాసీ విద్యార్థుల వసతి గృహాల కోసం ప్రత్యేకంగా రూ.11 కోట్లు విడుదల చేశారు.