సోషల్ మీడియాలో వచ్చేదంత నిజమని నమ్మితే పరిస్థితి ఎలా ఉంటుందనేదీ తెలియజేసే ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. నెల్లూరులో 2 రూపాయలకే బ్రాండెడ్ షర్ట్.. రూ.49కే బ్రాండెడ్ ప్యాంట్ ఇస్తామంటూ ఓ షాప్ ఓనర్.. దుకాణం ప్రారంభోత్సవం రోజు ఆఫర్ ప్రకటించాడు. తీరా అక్కడకు వెళ్లిన జనానికి షాక్ ఇచ్చారు. షాపు ఓపెన్ కూడా చేయలేదు. దీంతో అక్కడకు వచ్చిన జనం ఒళ్లు మండి ఆందోళనకు దిగగా.. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చింది.