Good news for hyderabad motorists: హైదరాబాద్లో నూతన ట్రాఫిక్ నియంత్రణ విధానాలు వస్తాయి. కమిషనర్ సీవీ ఆనంద్ నగరంలో వాహనాల వేగం పెరిగిందని, రహదారులు అలాగే ఉన్నాయని చెప్పారు. గూగుల్తో కలిసి పని చేస్తామని, ఐటీఎంఎస్ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. డ్రోన్లు, హై-రైజ్ కెమెరాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. 85 శాతం సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయని.. 90 శాతానికి పెంచే లక్ష్యం ఉందన్నారు. 'ఆపరేషన్ రోప్' కొనసాగుతుందన్నారు. ట్రాఫిక్ మార్షల్ పథకం ద్వారా సీఎస్ఆర్ భాగస్వామ్యాన్ని పెంచుతామని సీపీ వివరించారు.