ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడు ఓ ఆకతాయి. దాని ధర కేవలం రూ. 20 వేలు అని పోస్టు చేశాడు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చివరికి గిద్దలూరు ఎమ్మార్వో దృష్టికి వెళ్లింది. దీంతో కంగుతిన్న తహసీల్దార్.. పోలీసులను ఆశ్రయించాడు. ఎవడో ఆకతాయి ఎమ్మార్యో కార్యాలయాన్ని ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టాడంటూ ఫిర్యాదు చేశారు. ఎమ్మార్వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.