హైదరాబాద్ ఫ్యూచర్సిటీ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణ అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ చట్టం-2013 నిబంధనలు పాటించలేదని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన కోర్టు.. ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, రైతులకు పరిహారం చెల్లించే వరకు పిటిషనర్ల భూములను స్వాధీనం చేసుకోబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారు. ఓఆర్ఆర్ కొంగరకలాన్ నుంచి మీర్ఖాన్ పేట్ మీదుగా ఆకుతోటపల్లి వరకు ఈ రోడ్డును ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.