తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రోడ్ల నిర్మాణం కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేయనుంది. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం లాంటివి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.