Prasad Seeds Commits 10 crore contribution in response to P4 Model: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీ4 విధానానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పీ-4 విధానం కింద భారీ విరాళం ఇచ్చేందుకు ప్రసాద్ సీడ్స్ ముందుకు వచ్చింది.సొంత నిధులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం చేపట్టేందుకు ప్రసాద్ సీడ్స్ ముందుకు వచ్చింది. కొమ్మమూరు లిఫ్ట్ స్కీమ్ నిర్మాణానికి రూ.10 కోట్లు అందిస్తామని ప్రసాద్ సీడ్స్ ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ సీడ్స్ అధినేతను సీఎం నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.