తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు పితృ వియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతూ పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా సింహాచలం.. శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. పల్లా సింహాచలం కూడా టీడీపీలో పనిచేశారు. టీడీపీ నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.