డబ్బులు లేక ఏ ఒక్క వ్యక్తి కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్కు దూరం కాకూడదని నందమూరి బాలకృష్ణ పేర్కొ్న్నారు. 25 ఏళ్ల క్రితం చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నామని తేల్చి చెప్పారు. బసవతారకం ఆస్పత్రిలో నిత్యం 40 ఆపరేషన్లు జరుగుతున్నాయని.. వేలాది మందికి ఆశాకిరణంగా మారిందని చెప్పారు. తన తల్లికి క్యాన్సర్ వచ్చినప్పుడు పడిన కష్టం, బాధను చూసి.. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని పేర్కొన్నారు.