నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనం రేపుతోంది. ఇంట్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు బయటపడ్డాయి. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగి ఆ మృతదేహాలను గుర్తించారు. అయితే ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనేది తేలాల్సి ఉంది.