గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కృష్ణలంకలోని అతని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను విచారించారు. అనంతరం వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. సంచలనం రేపిన ఈ కేసులో నిష్పక్షపాత విచారణ కోసం ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిష్రకాష్ నేతృత్వంలో ఈ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.