Palnadu Father kills Son: సమాజంలో పరిస్థితులు రోజురోజుకూ ఎలా దిగజారుతున్నాయో తెలియజేసే ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో సొంత కొడుకును హత్య చేశాడో కన్నతండ్రి. హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పూడ్చేశాడు. అయితే నిజం నిప్పులాంటిది.. బయటకు రాక మానదు. పదిరోజుల కింద ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆ తండ్రిని అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో ఈ ఘటన జరిగింది.