సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో దర్యాప్తులో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. డీఐజీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించిన ఆయన.. పలు వివరాలు వెల్లడించారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ నుంచి బయల్దేరిన తర్వాత వివిధ టోల్ గేట్ల వద్ద ఆగిన సీసీ టీవీ ఫుటేజీలను విడుదల చేశారు.