కృష్ణా జిల్లా పెడనలోని ఒక ప్రముఖ బంగారు దుకాణంలో ప్రధాన గుమస్తాగా పనిచేస్తున్న యువకుడు రూ. 1.50 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించాడు. ఇటీవల తన వివాహానికి స్థాయికి మించి ఖర్చు చేయడంతో అనుమానం వచ్చిన యజమానులు.. స్టాక్ తనిఖీ చేసి మోసాన్ని గుర్తించారు. యువకుడి ఇంటి నుండి నగదు, వెండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.