ప్రజా సమస్యల పరిష్కరానికి తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా నందిగరువు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో మాటామంతీ నిర్వహించారు. వారితో ముచ్చటించిన పవన్ కళ్యాణ్.. కన్నీరు మీ గడప తొక్కకుండా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. మావోయిస్టుల ప్రాబల్యమన్న ఇలాంటి ప్రాంతాలకు రావాలంటే రాజకీయ నేతలు భయపడతారని.. కానీ తాను ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తానన్నారు పవన్.