జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో రాజమండ్రి అర్బన్ ఇంఛార్జి అత్తి సత్యనారాయణ, కొవ్వూరు ఇంఛార్జి టీవీ రామారావులను తొలగించారు. పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కూటమి ఐక్యతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని తేల్చి చెప్పారు.