ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్ రావటం కలకలం రేపింది. డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బందికి చంపేస్తామంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని వారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత కూడా రియాక్టయ్యారు. వెంటనే ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుతో మాట్లాడారు. రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పిన డీజీపీ.. ఆగంతకుడు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు హోం మంత్రికి వివరించారు.