మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. విజయం సాధించిన మహాయుతి కూటమి నేతలకు, అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం మీద మరాఠా ప్రజలకు ఉన్న నమ్మకానికి తోడు.. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిండే, అజిత్ పవార్ సమష్టి నాయకత్వం కూడా ఎన్నికల్లో విజయానికి కారణమైందన్నారు. మహాయుతి కూటమి తరుఫున ప్రచారం చేయటం తనకు దక్కిన గౌరవమని చెప్పిన పవన్ కళ్యాణ్.. అభివృద్ధి, సంక్షేమంలో పరస్పరం సహకరించుకుందామని సూచించారు.