ఒక్కసారి పవన్ కళ్యాణ్ను కలవనివ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తల్లీ, కుమార్తె ఏపీ అసెంబ్లీ వద్ద గత ఐదారు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. తమది కోరంగి గ్రామమని.. ఊర్లోని కొంతమంది తమను ఊరు విడిచిపెట్టి వెళ్లాలని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేదని చెప్తున్నారు. జిల్లా ఎస్పీని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. పవన్ కళ్యాణ్ను కలిసి తమ సమస్య చెప్పుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.