Pawan Kalyan: మధుసూదన్ కుటుంబానికి జనసేన రూ.50 లక్షలు సాయం

10 months ago 17
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు కుంటుంబానికి జనసేన పార్టీ తరపున రూ.50 లక్షల విరాళం ప్రకటించారు.. ఇక, మధుసూదన్‌ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో పహల్గామ్‌ అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. భారత్ దేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను ప్రేమిస్తాం అంటారు.. వీళ్లంతా కాంగ్రెస్ నాయకులు.. కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారన్నారు. అంతలా పాకిస్థాన్‌ మీద ప్రేమ ఉంటే భారత్‌ను వదిలి పాకిస్థాన్‌ వెళ్లిపోవాలన్నారు. జనసేన పార్టీ ఏపీ, తెలంగాణలో ఉంది.. కానీ, జనసేన విధానం జాతీయ వాదం అన్నారు పవన్ కళ్యాణ్.
Read Entire Article