వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీని శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ క్యాంప్ కార్యాలయంలో జనసేన నేతలతో పవన్ కళ్యాణ్ పదవి - బాధ్యత పేరుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పలువురు నేతలు హాజరయ్యారు.