ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి వేగంగా నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో తన దృష్టికి వచ్చే అంశాలపై సత్వరమే స్పందించే పవన్ కళ్యాణ్.. ఈ క్రమంలోనే విద్యార్థుల కష్టాలను చూసి వెంటనే ఓ ఊరికి రోడ్డును మంజూరు చేయించారు. నెల్లూరు జిల్లా గజ్జెలవారిపల్లెకు చెందిన కొంతమంది విద్యార్థులు తమ ఊరికి రోడ్డు వేయించాలంటూ పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. బురదలో నడవలేకపోతున్నాం పవన్ సార్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ ఊరికి రోడ్డు మంజూరు చేయించారు.