దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ తుది దశకు చేరుకుంటోంది. ఈ కేసులో కీలక ఆధారాలను సిట్ సేకరించినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ట్యాపింగ్లో అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు అధికారులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా సిట్ ముందు విచారణకు హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్పై విమర్శలు గుప్పించారు.