Pawan kalyan Sravana Sukravaram Gift: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రావణ శుక్రవారం కానుక ప్రకటించారు. శ్రావణ మాసం చివరి శుక్రవారమైన ఆగస్ట్ 22వ తేదీ వీటిని అందించనున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నారు.ఈ వ్రతాలకు హాజరయ్యే మహిళలకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయనున్నారు. పది వేల మంది మహిళలకు పంపిణీ చేసేలా జనసేన పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.