ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఆవిష్కృతం అవుతోంది.. ఆంధ్రుల కల సాకారం కాబోతోంది. ఐదు కోట్లమంది ఆంధ్రుల ఆశగా, ఆకాంక్షగా ఉన్న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ వేడకకు అంతా సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది.. 'అమరావతి పునఃప్రారంభం' పేరుతో ఈ వేడుకను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.