Kurnool Traffic Restrictions: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన నేపథ్యంలో, ఈ నెల 16న కర్నూలు జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. శ్రీశైలం దర్శనం అనంతరం, నన్నూరులో ఏర్పాటు చేసిన సభకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిర్దేశిత మార్గాల్లో మళ్లించి, రద్దీ నియంత్రణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ కంట్రోల్ పై అధికారులకు సూచనలు అందాయి.