ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు, రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అలాగే గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయడానికి అధునాతన సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టెక్నాలజీ కళ్లుగప్పేందుకు ఏపీలోని గంజాయి సాగుదారులు కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల దృష్టి నుంచి తప్పించుకోవడానికి పోర్ట్పోలియో ఫార్మింగ్ పద్ధతిని ఫాలో అవుతున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ సమావేశంలో నార్కోటిక్స్, పోలీస్ అధికారుల మధ్య ఇదే అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.