Posani Krishna Murali: పోసానికి భారీ షాక్.. సీఐడీ కేసు నమోదు.. ఆ ఫిర్యాదుపైనే..

1 year ago 31
సినీనటుడు పోసాని కృష్ణ మురళికి షాక్ తగిలింది. ఏపీ సీఐడీ అధికారులు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు. చంద్రబాబును కించపరిచేలా పోసాని కృష్ణ మురళి మాట్లాడారంటూ తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇప్పటికే పలుచోట్ల పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడులను ఉద్దేశించి పోసాని కృష్ణ మురళి కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదులు వచ్చాయి.
Read Entire Article