YS Jagan demands on Pulivendula ZPTC By poll Reconduct: వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటింగ్ మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పోలింగ్ పూర్తైన అనంతరం.. వైఎస్ జగన్ ఎన్నికల ఓటింగ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన ట్వీట్ చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలను హైజాక్ చేశారని ఆరోపించిన వైఎస్ జగన్.. ఈ ఎన్నికలను రద్దు చేసి మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.