Pulivendula: మాజీ సీఎం వైఎస్ జగన్ పని అయిపోయిందని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలకు తెరతీశారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలను కోల్పోయిన జగన్.. ఇప్పుడు సొంత మండలంలో కూడా తన వైసీపీని గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇక జగన్కు వేరే దారి లేదని.. వైఎస్సార్సీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాడేమోనని.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. జగన్కు మిగిలిన దారి అది ఒక్కటేనని తేల్చి చెప్పారు.