ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు గంటలు పిడుగులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ పలు జిల్లాలకు శుక్రవారం సాయంత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.