చంద్రబాబు నాయుడు హయాంలో సాగు, తాగునీటి రంగానికి కొత్త కళ వచ్చిందని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. రాయలసీమ మొదలుకొని ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఏపీని అగ్రభాగాన నిలిపేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారన్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు మేలు కలిగించే హంద్రీనీవాకు రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడిదే అని కొనియాడారు. వెలిగొండకు రూ. 5,233 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తే.. జగన్ ఖర్చు చేసింది కేవలం రూ. 840 కోట్లు అని వెల్లడించారు