హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, గచ్చిబౌలిలో భారీ వర్షం.. ఇతర ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. వాతావరణ శాఖ రాగల మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప భయటకు రావద్దని.. ముఖ్యంగా రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.