గతేడాది నవంబర్ నెలలో సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం అందించింది. నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం చెక్కులు అందించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందించారు. ఈ ప్రమాదంలో 44 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం పరిహారం అందించింది.