తెలంగాణలో మరో అడ్వెంచరస్ టారిస్ట్ ప్లేస్ అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి జిల్లాలో పాండవుల గుట్టలను స్పెషల్ ఎకో, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఎకో టూరిజం, డీఎంఎఫ్టీ నిధులతో టెంట్ క్యాంపింగ్, కిచెన్లు, టాయిలెట్లు, ఇతర మౌళిక వసతులు కల్పించారు. 200 మంది టూరిస్టులు బస చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, నైట్ క్యాంపింగ్తో పాటు ద్వంస కుంటలో సింగిల్ బోటింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాండవుల గుట్టలు, గణపసముద్రం, నాపాక, కోటంచ ప్రాంతాలను కలిపి టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.