సాకర్ స్టార్ లియోనాల్ మెస్సీ హైదరాబాద్లో సందడి చేశారు. ఉప్పల్ వేదికగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొన్నారు. అపర్ణ మెస్సీ టీమ్, సింగరేణి ఆర్ఆర్ టీమ్ మధ్య జరిగిన మ్యాచ్లో సింగరేణి జట్టు గెలుపొందింది. సింగరేణి ఆర్ఆర్ జట్టు తరుఫున సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగి గోల్ సాధించడం విశేషం. మ్యాచ్ అనంతరం విజేతకు మెస్సీ ట్రోఫీని బహూకరించారు. ఈ మ్యాచ్ చూడటానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు.