వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి రోజా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కుప్పంలో జరిగిన ఓ ఘటన వైరల్ కాగా.. ఈ వీడియో షేర్ చేస్తూ రోజా విమర్శలు చేశారు. స్కూలు పిల్లలతో చెత్త ఎత్తిస్తున్నారంటూ రోజా ఆరోపించారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలా జరగడం విచారకరమని.. దీనిపై ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు.