RK Roja: మోసం, దగా.. ఇప్పుడు ఆ బాండ్లను ఏం చేసుకోవాలి?

1 year ago 33
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌పై వైసీపీ విమర్శనాస్త్రాలు సంధించింది. సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపులు చెప్పకుండా.. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ కూటమి చెప్పిన సూపర్ సిక్స్ కాస్తా సూపర్ చీట్స్‌గా మారిందన్న మాజీ మంత్రి రోజా.. నారా చంద్రబాబు నాయుడు తన తొలి బడ్జెట్‌లోనే ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు నెలకు 1500 పథకాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తల్లికి వందనం పథకం నిధులను కూడా కోత పెట్టారని.. అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమైన నిధులను కేటాయించలేదని రోజా విమర్శించారు.
Read Entire Article