RP Sisodia: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్రంలో అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన భూములను గుర్తించినట్లు తెలిపారు. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన లక్షలాది ఎకరాల భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ దస్త్రాల దహనం కేసులో విచారణ సందర్భంగా ఈ భూముల వ్యవహారం బయటికి వచ్చినట్లు సిసోడియా వివరించారు.